YSRCP: వైసీపీ శ్రేణులకు సీఎం జగన్ కీలక పిలుపు

by Disha Web Desk 12 |
YSRCP: వైసీపీ శ్రేణులకు సీఎం జగన్ కీలక పిలుపు
X

దిశ, వెబ్‌డెస్క్: ఎన్నికలు దగ్గర పడుతుండటంతో వైసీపీ అధినేత సీఎం జగన్ పార్టీ కార్యకర్తలకు కీలక పిలుపునిచ్చారు. వైసీపీ పార్టీ నేతలతో ఈ రోజు నిర్వహించిన కీలక సమావేశలంలో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. త్వరలోనే రాష్ట్రంలో ఎన్నికలు రానున్నాయి. దీనికి సంబంధించి అసెంబ్లీ, లోక్ సభ అభ్యర్థుల ఎంపిక దాదాపు పూర్తయిపోయిందని చెప్పుకొచ్చారు. అలాగే ఈ ఎన్నికల్లో వైసీపీ గెలవాలంటే వచ్చే రెండు నెలలు చాలా కీలకమన్నారు. బూత్ కమిటీ పరిధిలో ఉన్న ఓటర్లను పార్టీ నేతలు, కార్యకర్తలు ఐదు సార్లు కంటే ఎక్కువ కలవాలని చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో గత ఐదు సంవత్సరాల్లో వైసీపీ ప్రజలకు చేసిన మంచి పనుల గురించి చెప్పాలని సూచించారు. అలాగే వచ్చే 2 నెలలు కార్యకర్తలు కష్టపడి పనిచేస్తే.. మళ్లీ వచ్చేది వైసీపీ ప్రభుత్వమనే అని ధీమా వ్యక్తం చేశారు.

Next Story

Most Viewed